లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు

లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు


బెర్న్: భారత విచారణ బృందాలకు సమాచారం అందించే అంశంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్‌ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్‌టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దౌత్య సహకారం కోసం సోమవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్లలో ఒకటి లలిత్ మోదీకి, మరొకటి మినాల్ మోదీ అలియాస్ మినాలినీ మోదీకి పంపారు.



వీటిపై స్పందించేందుకు వారికి పదిరోజుల గడువునిచ్చారు. స్విట్జర్లాండ్‌లో వారిద్దరికి సంబంధించిన అధికార ప్రతినిధుల పేర్లను తెలపాలంటూ అందులో కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top