ఆఫ్ఘానిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 45 మంది మృతి
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 45 మంది మరణించారు. పాకిస్థాన్ సరిహద్దున ఉన్న పాక్టికా ప్రావిన్స్లో ఓ వాలీబాల్ టోర్నమెంట్ సందర్భంగా దాడి జరిగింది. అంతర్ జిల్లా వాలీబాల్ టోర్నీని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆత్మాహుతి దళ సభ్యుడు ప్రేక్షకుల మధ్యకు వెళ్లి బాంబును పేల్చుకోవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.