ఇండోనేసియాలో భూకంపం
జకర్తా: ఇండోనేసియా తూర్పు కోస్తా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. సునామీ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. టొబెలొ నగరానికి 157 కిలో మీటర్ల దూరంలో 55 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు.