బాంబు పేలుళ్లులో 10 మంది సైనికుల మృతి
ఈజిప్టు: రాజధాని నగరం కైరోలోని సెంట్రల్ సినాయ్లో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు, మిలటరీ సైనికులే ప్రధాన టార్గెట్గా చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో 10 మంది సైనికులు చనిపోయారు. సైనికులు ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న సమయంలో బాంబు దాడి జరగడంతో ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో 15 మంది ఉగ్రవాదులు మరణించారు. మరో ఏడుగురిని సజీవంగా పట్టుకున్నారు. ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత దక్షిణ, మధ్య సినాయ్ ప్రాంతాల్లో చాలా సార్లు బాంబు దాడులు జరిగాయి.ఈ దాడులన్నీ పోలీసులు, సైనికులను టార్గెట్గా చేసుకుని జరిగాయి. భద్రతా దళాలు కొంత మంది అనుమానితులను అరెస్ట్ చేసి, టెర్రరిస్టుల నివాసాలను ధ్వంసం చేశారు.