సౌదీలో ఉగ్ర కుట్ర భగ్నం


రియాద్‌: ముస్లింల పవ్రిత స్థలం మక్కాలో భారీ ఉగ్రవాద కుట్రను సౌదీ అరేబియా భద్రతా దళాలు భగ్నం చేశాయి. మక్కా మసీదులో ఉగ్రదాడులు జరగొచ్చన్న సమాచారంతో జెడ్డా, మక్కా తదితర ప్రాంతాల్లో సోదాలు సమయంలో ఒక ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 11మంది గాయపడ్డారని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.



వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఒక మహిళతో పాటు మరో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశామని వెల్లడించింది. ఈ చర్యకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యతను ప్రకటించలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top