దుబాయ్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

దుబాయ్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు - Sakshi

దుబాయ్:  దుబాయ్లోని తెలుగు వారందరికీ సంక్రాంతి ఒకరోజు ముందుగానే వచ్చేసింది. వేవ్ రెసోనెన్సు ఈవెంట్స్ సంస్థ ఇక్కడి తెలుగు వారందరికోసం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు జరపటం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా షార్జాలో మరుబెల్లా రిసార్ట్లో ఈ వేడుకలని ఏర్పాటు చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని తెలుగు వారంతా ఈ వేడుకకి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలంతా సంప్రదాయ వస్త్రాధారణతో ఇండియాలో జరుపుకునే పద్ధతులకి ఏ మాత్రం తీసిపోకుండా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 

 

గృహిణులకు ముగ్గుల పోటీలు, పిల్లలకి డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు. మగవారంతా ఫ్యాషన్ వాక్, డాన్సులతో అదరగొట్టారు. ఇటీవల ప్రవాసీ మిత్ర అవార్డు అందుకున్న శ్రీ తులసి ​ప్రసాద్, మాగల్ఫ్.కామ్ నిర్వాహకులు శ్రీకాంత్ని తెలుగు వారంతా అభినందించారు. వేడుకల్లో పాల్గొన్న వారి పేర్లను లక్కీ డిప్ తీయగా ఇండియాకి తిరుగు ప్రయాణ టికెట్ను షార్జాకి చెందిన ప్రియా శ్రీరామ్ గెలుచుకున్నారు. ఉదయం 10. 30 నిమిషాలకి ప్రారంభమైన వేడుకలు సాయంత్రం 6 గంటల వరకు అవిశ్రాంతంగా కొనసాగాయి. 


చివర్లో తంబోలా నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ప్రముఖ సంఘసేవకురాలు ఉమా పద్మనాభం కార్యక్రమాన్ని అంతా పర్యవేక్షించారు. ఈ సంవత్సరంతో వేవ్ సంస్థ స్థాపించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఏప్రిల్ 2​8​ న పెద్ద ఎత్తున వేడుకల్ని నిర్వహించనున్నట్లు వేవ్ వ్యవస్థాపకులు శ్రీ గీతా రమేష్ తెలిపారు. దుబాయ్లో ఇలాంటి వేడుకల్ని నిర్వహించటానికి ప్రభుత్వం నుండి ఆయా సంస్థకి అనుమతి తప్పని సరి. తెలుగు సంస్థల్లో ఆ అనుమతి కలిగిన ఏకైన సంస్థ వేవ్ అని సంస్థ అధినేత రమేష్ బాబు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని తెలుగువారి వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. ఆద్యంతం ఈ కార్యక్రమాన్ని సుధా విజయకుమార్ , ప్రశాంతి , రమేష్ లు తమ వ్యాఖ్యానంతో ఆహ్లాదకరంగా నిర్వహించారు. కోడి పందాలు, గంగిరెద్దులు ఉంటే కనుక ఇక ఈ పండక్కి ఇండియా వెళ్లనవసరం లేదు అని అతిథులంతా ఛలోక్తులు విసురుకున్నారు.​ ఈ వేడుకకి చెన్నైకి చెందిన ఆర్ఎంకే కన్స్స్ట్రక్షన్ స్పాన్సర్ చేసింది.









Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top