ఈ భామే బాంబు పేల్చిందా ?

ఈ భామే బాంబు పేల్చిందా ? - Sakshi


మాస్కో: రష్యాకు చెందిన గ్లామరస్ పాపులర్ పార్లమెంట్ సభ్యురాలు ఒక్సానా బొబ్రోవస్కాయా (30), భర్త నికిత గురువారం రాత్రి బాంబు పేలుడులో మరణించడం స్థానికంగా ప్రకంపనలు సృష్టించింది. రష్యా విమానాన్ని కూల్చివేసిన నేపథ్యంలో టర్కీ, రష్యా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపింది. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైందని భయపడ్డామని కూడా వారు మీడియాకు తెలిపారు. ముందుగా టెర్రరిస్టుల హస్తం ఉండొచ్చని అనుమానించిన పోలీసులు అలాంటిదేమీ లేదని ఆనక తేల్చారు. ఎంపీ దంపతుల్లో ఒకరు గ్రెనేడ్‌గానీ, టీఎన్‌టీ లాంటి పేలుడు పదార్థాన్నిగానీ పేల్చి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు.



 వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన యునెటైడ్ రష్యన్ పార్టీ ఎంపీ అయిన ఒక్సానా, భర్త నికిత తమ టయోటా కారులోని వెనక సీటులో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు బాంబు పేలిందని, ముఖాలకు దగ్గరగా పేలడం వల్ల ఇరువురు ముఖాలు గుర్తుపట్టరాకుండా ఛిద్రం అయ్యాయని పోలీసులు తెలిపారు. వారిద్దరి శరీరాలు నడుము నుంచి కింది వరకు నగ్నంగా ఉన్నాయని చెప్పారు. పేలుడుకు ముందు వారిద్దరు సెక్స్‌లో పాల్గొన్నట్టు ఫోరెన్సిక్ నివేదక కూడా వెల్లడించింది. సైబీరియా ప్రాంతంలోని నొవోసిబిరిస్క్ నగరంలో ఈ సంఘటన జరిగింది.



 చూడగానే ఆకట్టుకునే ముఖారవిందం గల ఒక్సానా మరో ధనవంతుడైన బాయ్ ఫ్రెండ్‌తో గత కొంతకాలంగా తిరుగుతోందని, అందుకని మిలటరీ స్పెషల్ సర్వీసులో పనిచేస్తున్న భర్త నికితను నిర్లక్ష్యం చేస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో బాయ్ ఫ్రెండ్‌తో తిరుగుతుందన్న అక్కసుతో భర్తే గ్రెనేడ్ పేల్చి ఉండవచ్చని, పేల్చే ముందు బలవంతంగా సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా కూడా బెదిరించి ఉండవచ్చని కేసు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. డైవోర్స్‌కు అంగీకరించడం లేదన్న కసితో  ఒక్సానా కూడా బాంబును పేల్చే అవకాశం లేకపోలేదని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top