300 మంది జీహాదిస్టుల హతం


మాస్కో: సిరియాలో ఐఎస్ఐఎస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులపై రష్యా వైమానిక దళం జరిపిన దాడుల్లో 300 మందికిపైగా జీహాదిస్టులు మరణించారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. సిరియాలోని రఖ్ఖా, అలెప్పో తదితర ప్రాంతాల్లో లివా అల్ హక్, ఐఎస్ఐఎస్ ల స్థావరాలను గుర్తించి వాటిపై బాంబుల వర్షం కురిపించినట్లు శుక్రవారం ఒక ప్రకటనను విడుదలచేసింది.


 


ఇందుకోసం కెఏబి-500 బాంబులను కురిపించే ఎస్ యు- 34, ఎస్ యు- 24 జెట్ ఫైటర్లను వినియోగించినట్లు తెలిసింది. సిరియా అధ్యక్షుడు అల్ అసద్ కు అనుకూలంగా తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులపై పదిరోజుల కిందట దాడులు ప్రారంభించిన రష్యా.. రోజుకు పది ప్రత్యేక లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తున్నది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top