రూ. 1.41లక్షల కోట్ల పరిహారం
కేన్సర్ బాధిత కుటుంబానికి ఇవ్వండి
అమెరికా పొగాకు కంపెనీకి ఫ్లోరిడా కోర్టు ఆదేశం
వాషింగ్టన్: అమెరికాలో రెండో అతిపెద్ద పొగాకు కంపెనీ ఆర్జే రేనాల్డ్స్పై ఓ బాధితురాలు ఘన విజయం సాధించింది. తన భర్త పొగతాగే అలవాటుతో కేన్సర్కు గురై మరణించారని, కంపెనీ తప్పిదం వల్లే ఇది జరిగిందని ఆమె వాదించగా... 2,360 కోట్ల డాలర్ల(రూ. 1.41లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని ఫ్లోరిడా కోర్టు ఆదేశించింది.
సింథియా రాబిన్సన్ భర్త మైఖేల్ 1996లో కేన్సర్తో మరణించారు. పొగతాగితే ఊపిరితిత్తుల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పొగాకు కంపెనీ తన భర్తకు చెప్పడంలో విఫలమైందని ఆమె 2008లో కోర్టును ఆశ్రయించారు. దీంతో తాజా తీర్పు వెలువడింది. వ్యక్తిగత కేసుల్లో భారీ పరిహారమివ్వాలన్న తీర్పు ఇదేనని బ్రిటిష్ డైలీ ఇండిపెండెంట్ పేర్కొంది.