పేలిన బాంబు: మృతుల్లో జిల్లా కలెక్టర్

పేలిన బాంబు: మృతుల్లో జిల్లా కలెక్టర్


కందహర్: బాంబు పేలుడులో జిల్లా కలెక్టర్తోపాటు ఆయన భద్రత సిబ్బంది మరణించారు. ఈ సంఘటన ఆఫ్ఘానిస్థాన్లోని చెర్చినోలో శనివారం చోటు చేసుకుంది. చెర్చినో జిల్లా కలెక్టర్ మహ్మమద్ ఇస్మాయిల్ హక్యార్... భద్రత సిబ్బందితో కలసి కార్యాలయానికి వెళ్తుండగా రహదారి పక్కనే అమర్చిన బాంబు పేలిందని ఉర్వజ్గన్ ప్రావెన్స్ గవర్నర్ మహ్మద్ నయాబ్ వెల్లడించారు.


ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో కలెక్టర్ హక్యార్ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top