నేపాల్లో ఆకలి కేకలు
ఖాట్మండూ: నేపాల్ భూకంప బాధితులు ఆహారం, నీళ్లు అందక అలమటిస్తున్నారు. శనివారం సంభవించిన భారీ భూకంపానికి వేలాదిమంది నిరాశ్రయులవడంతో ఆరుబయటే కాలం గడుపుతున్నారు.
దాదాపు 2500 మంది మరణించగా, వేలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. పురాతన కట్టడాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. కిరాణా షాపులు అందుబాటులో లేవు. దీంతో ప్రజలు ఆకలిదప్పికలతో అలమటిస్తున్నారు. ఆహారం, నీళ్లు తమకు అందడం లేదని, సరఫరా చేయాలంటూ సోమవారం ఖాట్మండూలో నిరసనకు దిగారు. తల దాచుకోవడానికి తగిన టెంట్లూ కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వైద్య సేవలు అందించలేదని క్షతగాత్రలు నిరసన తెలియజేశారు.