పాకిస్తాన్ ముఖ్యమైన మిత్రదేశం: చైనా ప్రకటన
బీజింగ్: పాకిస్తాన్ తమకు ముఖ్యమైన మిత్ర దేశమని చైనా సోమవారం ప్రకటించింది. తమ దేశంలో పర్యటిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్తో భేటీ అయిన సందర్భంగా చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో ఉండగా, చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా, షరీఫ్ చైనాలో పలువురు నేతలను కలుసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం తీసుకుంటున్న చర్యలను చైనా మిలిటరీ అధికారులకు షరీఫ్ వివరించినట్లు సమాచారం.