పాకిస్తాన్ ముఖ్యమైన మిత్రదేశం: చైనా ప్రకటన

పాకిస్తాన్ మాకు ముఖ్యమైన మిత్రదేశం: చైనా ప్రకటన


 బీజింగ్: పాకిస్తాన్ తమకు ముఖ్యమైన మిత్ర దేశమని చైనా సోమవారం ప్రకటించింది. తమ దేశంలో పర్యటిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్‌తో భేటీ అయిన సందర్భంగా చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనలో ఉండగా, చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం.



ఇదిలా ఉండగా, షరీఫ్‌ చైనాలో పలువురు నేతలను కలుసుకున్నారు.  ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత కోసం తీసుకుంటున్న చర్యలను చైనా మిలిటరీ అధికారులకు షరీఫ్ వివరించినట్లు సమాచారం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top