రెండేళ్లలో 359 మంది పోలీసులు దుర్మరణం
లాగోస్ : దేశంలో గత రెండేళ్ల కాలవ్యవధిలో 359 మంది పోలీసులు అధికారులు విధి నిర్వహాణలో మరణించారని నైజీరియా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సల్మాన్ అరాసి ఆదివారం లాగోస్లో వెల్లడించారు. వీరంత 2014 జనవరి నుంచి 2016 ఏప్రిల్ మధ్య కాలంలో మరణించారని చెప్పారు. అలాగే ఇదే సమయంలో 272 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. దేశంలో అశాంతి కారణంగా దాడులు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. 2009 నాటి నుంచి పోలీసులపై బోకోహరామ్ తీవ్రవాదులు దాడులు పెరిగాయని సల్మాన్ అరాసి చెప్పారు.