కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత

కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత - Sakshi


 అద్భుతాలు అన్నిసార్లూ జరగవు.. జరిగినప్పుడు తెలుసుకోవాలి.. దాన్ని చూసేయాలి.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న విషయం కూడా ఒక అద్భుతంలాంటిదే. ముందు ఈ ఫొటోలను ఓసారి చూడండి.. ఈ రెండూ ఒకరివే!!



 ఈమె పేరు జొయన్నా.. పోలండ్‌లో ఉంటోంది. ‘న్యూరోఫైబ్రోమెటాసిస్’ అనే జన్యుపరమైన వ్యాధి వల్ల ఆమె ముఖం ఇలా కణితులతో నిండిపోయి.. అందవికారంగా తయారైపోయింది. మాట్లాడాలన్నా.. తినాలన్నా.. నరక ం కనిపించేది.  కళ్లు సరిగా కనిపించేవి కావు.. చెవులు కూడా వినిపించేవి కావు.. అలాంటి దుర్భర పరిస్థితిలో మూడేళ్ల క్రితం ఆమెకు డాక్టర్ మెకజ్యూస్కీ నేతృత్వంలోని వైద్యుల బృందం ముఖమార్పిడి ఆపరేషన్ చేసింది.. ఇది ఆ దేశంలోనే రెండో ముఖమార్పిడి శస్త్రచికిత్స అట.. 23 గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా జొయన్నా ముఖం మీద చర్మంలో 80 శాతాన్ని మార్చేశారు. తర్వాత చిన్నచిన్న చికిత్సలు జరిగాయి..

 కట్ చేస్తే.. మూడేళ్ల తర్వాత ఇదిగో ఇలా అద్భుతం ఆవిష్కృతమైంది..

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top