బేషరతుగా భారత్‌తో చర్చలకు సిద్ధం: షరీఫ్


వాలెట్టా (మాల్టా): సుస్థిరమైన శాంతి కోసం బేషరతుగా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ పేర్కొన్నారు. భారత్‌, అఫ్గానిస్థాన్‌ సహా అన్ని పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని పాకిస్థాన్ భావిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన పేర్కొన్నట్టు జీయో న్యూస్ తెలిపింది.



మాల్టా రాజధాని వాలెట్టాలో జరిగిన కామన్‌వెల్త్ ప్రభుత్వాధిపతుల సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో సమావేశంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని కామెరాన్‌, షరీఫ్ నిర్ణయించినట్టు జీయో న్యూస్ తెలిపింది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top