కాబూల్లో పేలుడు, 24మంది మృతి
కాబూల్: అప్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. కాబూల్కు పశ్చిమ ప్రాంతంలో సోమవారం జరిగిన ఆత్మాహతి దళం దాడిలో 24మంది మృతి చెందగా, మరో 42మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆప్ఘన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నజీబ్ డానిష్ ధ్రువీకరించారు. ఈ దుర్ఘటన దర్యాప్తు కొనసాగుతున్నదని ఆయన పేర్కొన్నారు. కాగా మృతులతో పాటు, క్షతగాత్రులందరూ సామాన్య పౌరులే. ఓ మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ సంఘటనకు తామే బాధ్యులమని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంబంధిత వార్తలు