40 ఏళ్ల తర్వాత వీడిన అదృశ్య మిస్టరీ
దుబాయ్: ఇక ఎప్పటికీ తిరిగిరాడనుకున్న వ్యక్తి అచూకీ లభించింది. 40 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమై సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. ఈ అనూహ్య సంఘటన దుబాయ్లో జరిగింది.
కేరళకు చెందిన అబ్దుల్లా పునాతిల్ ఉస్మాన్ 1970లో ఉపాధి కోసం యూఏఈ వెళ్లాడు. అక్కడ కుక్గా పనిలో కుదిరాడు. ఆ తర్వాత ఎప్పుడూ సొంతూరుకు రాలేదు. 40 ఏళ్లుగా ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. మీడియా, స్నేహితుల సాయంతో కూడా ప్రయత్నించి చూశారు. ఇక లాభంలేదనుకుని ఆశలు వదిలేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్లోని ఓ ఆస్పత్రిలో ఉస్మాన్ ఉన్నట్టు స్నేహితులు గుర్తించారు. తమ అనుబంధం గురించి చెబితే ఉస్మాన్ ఆశ్చర్యపోయాడు. అయితే తాను ఎందుకు అజ్ఞాతంలో ఉంటున్నాడో ఉస్మాన్ చెప్పలేదు. ఇప్పటికే అదే ఉద్యోగం చేస్తూ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. రెండు నెలల క్రితం కాలిగాయంతో ఆస్పత్రిలో చేరాడు. ఉస్మాన్ను కేరళకు తీసుకువచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఉస్మాన్ కూడా సొంతూరు రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు.
మరిన్ని వార్తలు