'క్షమించండి.. నావల్ల మీకు తీరని బాధ'
విచిత: అమెరికాలో ఓ విమనాశ్రయాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రపన్నిన విచితా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమెరికా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడటం ద్వారా ఓ రకంగా పూర్తిగా ఆ విమానాశ్రయాన్ని నేలమట్టం చేసేందుకు అతడు కుట్ర చేశాడని, అదే జరిగి ఉంటే దేశ చరిత్రలోనే పెను విషాధ ఘటనగా మిగిలిఉండేదని అన్నారు.
టెర్రీ ఎల్ లోవెన్ అనే 60 ఏళ్ల వ్యక్తి 2013 డిసెంబర్లో ఓ వాహనం నిండుగా పేలుడు పదార్థాలు వేసుకొని దానిని నేరుగా తీసుకెళ్లి ఎయిర్ పోర్ట్లో పేల్చాలని కుట్ర చేశాడు. దీనిపై అండర్ కవరేజ్ ఆపరేషన్ చేసిన పోలీసులు చివరికి అతడిని అరెస్టు చేశారు. ఎఫ్బీఐ అదుపులోకి తీసుకొని అతడిని విచారించింది. 20 ఏళ్ల శిక్ష పడిన అనంతరం జైలు వైపు తరలి వెళ్లుతూ తన కుటుంబానికి టెర్రీ క్షమాపణలు చెప్పాడు. వారికి తీరని బాధను మిగిల్సి వెళుతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.