పడవ బోల్తా : 24కి పెరిగిన మృతులు


కౌలాలంపూర్ : మలేషియా పశ్చిమ తీరంలోని మలక్కా జలసంధి వద్ద గురువారం పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య శనివారానికి 24కి చేరింది. ఈ మేరకు మీడియా వెల్లడించింది. గల్లంతు అయన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు తెలిపింది.


తొమ్మిది బోటులు, రెండు ఎయిర్ క్రాఫ్టులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టాయని వివరించారు. గల్లంతైన వారినందరిని రక్షిస్తామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండోనేషియా వెళ్తు పడవ గురువారం బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఈ పడవలో మొత్తం 70 మంది ప్రయాణికులు ఉన్నారు. కేవలం 20 మందిని మాత్రం రక్షించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top