జపాన్ సేనలు దిగుతున్నాయ్..!

జపాన్ సేనలు దిగుతున్నాయ్..!


టోక్యో: తమ దేశ సముద్రతలాన్ని రక్షించుకునేందుకు జపాన్ సర్వత్రా సిద్ధమవుతోంది. చైనాతో వివాదం ఉన్న ఇషిగోకి ఐలాండ్లో తమ దేశానికి 500 మంది సైన్యాన్ని రంగంలోకి దించనుంది. ఈ సైన్యం ఆ ప్రాంతంలో గస్తీ దళంగా మారనుంది. 2019నాటికి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో తమ ప్రభావం ఉంటుందని జపాన్ రక్షణ వర్గాలు తెలిపాయి. సముద్రభాగం విషయంలో ఇప్పటికే చైనా జపాన్ ల మధ్య వివాదం ఉన్న విషయం తెలిసిందే.



దీంతో చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు జపాన్ ఇప్పటికే అక్కడి సముద్ర తలం క్షిపణి ప్రయోగాలు చేయడంతోపాటు సైనికపాటవాలు కూడా నిర్వహిస్తూ ఎలాంటి దాడినైనా, ఎవ్వరినైనా ఎదుర్కొంటాంమని పరోక్షంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి తమ సైన్యాన్ని అక్కడ దించాలనుకోవడం చైనాకు మింగుడుపడుతుందో లేదో. ఎందుకంటే ఇషిగోకి చాలా ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top