సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం

సొంత రాజధానిపై బాంబు జారవిడిచిన సైన్యం


బాగ్దాద్: ప్రాంతంమనది, దేశం మనది అనే విషయం మనకి తెలుస్తుంది తప్ప బాంబులకు తెలియదు కదా! శత్రుదేశాల్లో అయినా.. మాతృదేశాల్లో అయినా పేలిపోవడమే వాటి బాధ్యత. అందుకే విధ్వంసం సృష్టించే వీటిపట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రాణనష్టం, ఆస్తి నష్టం చవి చూడాల్సిందే. నిత్యం ఉగ్రవాదులతో పోరాడుతూ వారిని ఎదుర్కొనే క్రమంలో బాంబు దాడులకు దిగే ఇరాక్ సైన్యం చిన్న నిర్లక్ష్యం కారణంగా సొంత రాజధానిలోనే ఓ విధ్వంసాన్ని చూడాల్సి వచ్చింది.



బాంబు దాడులకు ఉపయోగించే తమ దేశ సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ఓ బాంబు జారి బాగ్దాద్పై పడి ఏడుగురు మృతిచెందారు. పన్నెండుమందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్మీ విభాగం తెలిపింది. 'సుఖోయ్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఓ బాంబు ఇరుక్కుపోయింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తుండగా అది జారి బాగ్దాద్లోని జదీదా ప్రాంతంలోగల ఆరు ఇళ్లపై పడింది. దీంతో అక్కడ ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది. రష్యా నుంచే ఇరాక్ ఈ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top