బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

బుష్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక


న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌ డబ్ల్యూ బుష్‌(సీనియర్‌) (92) అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఆయనను చేర్పించినట్లు అక్కడి కేహెచ్‌ఓయూ అనే టెలివిజన్‌ సంస్థ తెలిపింది. కొద్ది రోజుల తర్వాత ఆయనను ఆస్పత్రి వర్గాలు ఇంటికి పంపించే అవకాశం ఉందని జీన్‌ బెకర్‌ అనే వ్యక్తి తెలిపారు.



అయితే, ఆయనను ఏ ఆస్పత్రిలో చేర్పించారనే విషయం మాత్రం బయటకు తెలియనివ్వలేదు. అలాగే, ఆయన ఆస్పత్రిలో అనూహ్యంగా చేరడానికి గల కారనాలు కూడా చెప్పలేదు. గతంలో ఓ సారి ఆయన కిందపడి ఆయన మెడలోని ఎముక విరిగిపోవడంతో తనకుమారుడు జార్జ్‌ బుష్‌ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుర్చీకే పరిమితం అయిన సీనియర్‌ బుష్‌ ఇప్పటికే తన మెడకు పట్టీని కొనసాగిస్తున్నారు.


Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top