ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారత మహిళలు
న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత సంపన్నవంతులైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు భారతీయ మహిళలు స్థానం సంపాదించారు. గత సంవత్సరం ఇద్దరు భారతీయ మహిళలు మాత్రమే చోటుదక్కించుకోగా ఈ సారి వీరి సంఖ్య ఐదుకు పెరిగింది.
ఆ అయిదుగురు వీరే..
-
జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ - 283వ ర్యాంకు, -
బెన్నెట్ కోల్మెన్ కంపెనీకి చెందిన ఇందూ జైన్ -603వ ర్యాంకు -
థెర్మాక్స్ కు చెందిన అను ఆగా -1,312 వ ర్యాంక్ -
హేవల్స్ ఇండియా కు చెందిన వినోద్ గుప్త - 1,533వ ర్యాంకు -
బయోకాన్ ఎండీ కిరణ మజుందార్ షా - 1,741 ర్యాంకు
గతంతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా సంపన్నమహిళల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, మొత్తంగా వీరి సంఖ్య11 శాతంగా మాత్రమే ఉందని ఫోర్బ్స్ తెలిపింది.
సంబంధిత వార్తలు