ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు భారత మహిళలు


న్యూయార్క్: ప్రపంచంలో అత్యంత సంపన్నవంతులైన  మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.  ఇందులో ఐదుగురు భారతీయ మహిళలు  స్థానం సంపాదించారు.   గత సంవత్సరం ఇద్దరు భారతీయ మహిళలు మాత్రమే చోటుదక్కించుకోగా ఈ సారి వీరి సంఖ్య ఐదుకు పెరిగింది.


ఆ అయిదుగురు వీరే..


  • జిందాల్ గ్రూపుకు చెందిన సావిత్రి జిందాల్ -  283వ  ర్యాంకు,

  • బెన్నెట్ కోల్మెన్ కంపెనీకి చెందిన ఇందూ జైన్  -603వ ర్యాంకు 

  • థెర్మాక్స్ కు చెందిన  అను ఆగా -1,312 వ ర్యాంక్

  • హేవల్స్ ఇండియా కు చెందిన వినోద్ గుప్త - 1,533వ ర్యాంకు  

  • బయోకాన్ ఎండీ కిరణ మజుందార్ షా - 1,741  ర్యాంకు


గతంతో  పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా సంపన్నమహిళల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ,  మొత్తంగా వీరి సంఖ్య11  శాతంగా మాత్రమే  ఉందని ఫోర్బ్స్ తెలిపింది.



 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top