పాక్లో పేలుళ్లు, కాల్పులు
42 మంది మృతి
పెషావర్/కరాచి: పాకిస్తాన్లో శుక్రవారం చోటుచేసుకున్న మూడు పేలుళ్లు, కాల్పుల ఘటనల్లో 42 మంది చనిపోగా, 121 మంది గాయపడ్డారు. షియాల ప్రాబల్య ప్రాంతమైన పారాచినార్లోని ఓ మార్కెట్లో ప్రజలు రంజాన్ షాపింగ్లో ఉండగా రెండు పేలుళ్లు సంభవించాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ప్రాంతీయ పోలీస్ చీఫ్ కార్యాలయం సమీపంలో బాంబులతో నిండిన కారును పేల్చివేసి దుండుగుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 13 మంది మృత్యువాత పడగా, మరో 21 మంది గాయపడ్డారు.
గులిస్తాన్ రోడ్లోని ఐజీ ఇషాన్ మహబూబ్ కార్యాలయంలోకి కారుతో పాటు దూసుకెళ్లడానికి అనుమానితుడు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో పేల్చేసుకున్నాడు. మరోవైపు.. పారాచినార్లోని కుర్రమ్ గిరిజన ప్రాంతంలో మార్కెట్లో జరిగిన జంట పేలుళ్లలో 25 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డారు. కరాచీలోని ఓ రెస్టారెంట్ సమీపంలో ఇద్దరు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు మృతిచెందారు. పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్, ప్రధాని నవాజ్షరీఫ్, పంజాబ్ సీఎం షెహ్బాజ్ షరీఫ్ తదితరులు ఈ దాడులను ఖండించారు.