హజ్ విషాదంలో 74 మంది భారతీయుల మృతి


న్యూఢిల్లీ : గత నెలలో హజ్ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట కారణంగా మృతిచెందిన వారి సంఖ్య రోజుకోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ భారత్కు చెందిన యాత్రికులు 74 మంది మృతిచెందినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆదివారం నాటికి ఈ మృతుల సంఖ్య 58గా ఉండేది.


మీనాలో జరిగిన హజ్యాత్ర తొక్కిసలాట మృతుల పేర్లను ఇండియన్ కాన్సులేట్ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసినట్లు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మక్కాలో సెప్టెంబర్ 24న జరిగిన ఈ దుర్ఘటన కారణంగా ఇప్పటివరకు వెయ్యికిపైగా మృతిచెందిన విషయం విదితమే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top