వివాదాస్పద ద్వీపంలో చైనా సినిమా థియేటర్
బీజింగ్: వివాదాస్పద దక్షిణ చైనా సము ద్రం(ఎస్సీఎస్)లోని దీవి యాంగ్జింగ్లో చైనా ఓ సినిమా థియేటర్ను ప్రారంభించింది. సాన్షా యిన్లాంగ్ థియేటర్లో శనివారం ప్రదర్శించిన ‘ది ఎటర్నిటీ ఆఫ్ జియావో యులు’ చిత్రాన్ని దాదాపు 200 మంది స్థానికులు, సైనికులు వీక్షించినట్లు అక్కడి మీడియా ఆదివారం వెల్లడించింది.
ఈ దీవిలో కార్యకలాపాలను విస్తృతం చే యడం ద్వారా ఆ ప్రాంతంలో తన ఆధిప త్యాన్ని పెంచుకునే దిశగా చైనా పావులు కదుపుతోందని పేర్కొంది. అలాగే భవిష్యత్లో ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొ నేందుకు వీలుగా ఎస్సీఎస్లో కృత్రియ దీవులనూ నిర్మించి సైనిక దళాలు దిగేలా ఏర్పాట్లు చేయాలని చైనా చూస్తోంది.