50వేల బీఎండబ్ల్యూ బైకులు రీకాల్!
ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ సంచలన నిర్ణయం తీసుకుంది. గడిచిన 10ఏళ్లలో అమ్ముడయిన దాదాపు 50 వేల బైకులను వెనక్కి తిరిగి తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
2005 నుంచి వినియోగదారులు కొనుగోలుచేసిన ఆర్ 1200 జీఎస్, ఆర్ 1200 ఆర్టీ, ఆర్ 1200 జీఎస్ అడ్వెంచర్ బైకులను తిరిగి స్వాధీనం చేసుకోనున్నారు. ముందు చక్రం రిమ్ములో సాంకేతిక లోపాలను గుర్తించడమే ఇందుకు కారణమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ఈ లోపం వల్ల ఇప్పటికే దాదాపు రెండు వేలమంది వినియోగదారులు ప్రమాదానికి గురై మృతిచెందారని, మరిన్ని ప్రాణాలు పోకూడదన్నదే తమ ఉద్దేశమని వివరించారు. పాత బైకుల్నింటికి అమెరికా, కెనడాల్లోని ఆయా షోరూమ్స్లో ఉచితంగా కొత్త రిమ్ములను ఏర్పాటుచేస్తామన్నారు.
సంబంధిత వార్తలు