పాక్‌లో ‘నీర్జా’పై నిషేధం


కరాచి: కరాచి విమానాశ్రయంలో 1986లో పాన్ ఆమ్ ఫ్లైట్ 73 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనను ఆధారంగా చేసుకుని నిర్మించిన బాలీవుడ్ సినిమా ‘నీర్జా’ను పాకిస్తాన్ తమ దేశంలో నిషేధించింది. సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో పాక్‌ను చెడుగా చూపించారన్న ఆరోపణతో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.  రామ్ మాధ్వాని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాక్‌లో ఈ నెల 19న విడుదల చేయటానికి ఆ దేశం తొలుత అంగీకరించింది. అయితే పాక్ వ్యతిరేకమైన, ముస్లింల వ్యతిరేకమైన అంశాలు ఉన్నాయంటూ ఆ దేశ వాణిజ్య, సమాచార మంత్రిత్వశాఖ అనుమతిని ఉపసంహరించుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top