8 మంది పిల్లల్ని చంపిన తల్లి అరెస్టు


సిడ్నీ: ఆస్ట్రేలియాలో నరరూప రాక్షసిలా మారిపోయి ఏడుగురు సొంత బిడ్డల్ని పొడిచి చంపిన ఓ మహిళను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా(37) తన ఏడుగురు పిల్లలతో పాటు మేనకోడలైన మరో చిన్నారినీ చిదిమేసిందని పోలీసులు తెలిపారు.



వారియా శుక్రవారం ఈ దారుణానికి పాల్పడిందని, ఆమెకు కూడా ఛాతీపై, మెడపై గాయాలు అయ్యాయని వెల్లడించారు. వారియాకు ఐదుగురు భర్తల ద్వారా ఆ ఏడుగురు పిల్లలు జన్మించారని, పిల్లల తండ్రులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చనిపోయిన పిల్లల్లో 14, 12, 11, 2 ఏళ్ల వయస్సున్న నలుగురు బాలికలు, 9, 8, 6, 5 ఏళ్లున్న నలుగురు బాలురు ఉన్నారని పేర్కొన్నారు.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top