చైనాలో స్వల్ప భూకంపం
బీజింగ్: చైనా నైరుతి సిచ్వాన్ ప్రావిన్స్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూ ప్రకంపనలకు జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.