పాక్ జైళ్లలో 403 మంది భారతీయులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వివిధ జైళ్లలో 403 మంది భారతీయ ఖైదీలు ఉన్నారని, వారిలో 355 మంది జాలర్లు అని ఆ దేశం భారత్కు బుధవారం తెలిపింది. అదేవిధంగా భారత్లోని జైళ్లలో 278 మంది పాక్ ఖైదీలున్నారని, వారిలో 251 మంది పౌరులు కాగా, 27 మంది జాలర్లు ఉన్నారని భారత్ వెల్లడించింది. పాక్ జైళ్లలోని భారతీయులు, భారత్ జైళ్లలోని పాకిస్తానీల జాబితాలను ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి.