కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి

కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి


యుంబిన్(కెన్యా):  కెన్యాలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆల్ షబాబ్ ఉగ్రవాదులు ఈ మారణకాండను సృష్టించారు. ఉగ్రమూకలు బాంబు దాడితో పాటు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top