కూలిన సైనిక విమానం: 25 మంది మృతి

కూలిన సైనిక విమానం: 25 మంది మృతి - Sakshi


డమాస్కస్: సిరియాలో యుధ్ద విమానం  జనావాసాల మీద కుప్పకూలి పోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు.  చాలామంది గాయపడినట్టు తెలుస్తోంది.  నైరుతి సిరియా నగరం జెరికోలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది.  విమాన సిబ్బంది ఆచూకీ  తెలియలేదని మిలిటరీ వర్గాలు  తెలిపాయి.  


విమానం ఇళ్ల మీద కూలిపోవడంతో.. ఈ ప్రమాదంలో కొన్ని డజన్ల మంది గాయపడి ఉంటారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top