బొగ్గు గనిలో ప్రమాదం: 24 మంది మృతి


బిజీంగ్: ఈశాన్య చైనాలోని లియావొనింగ్ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మందికిపైగా మరణించారు. మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.


ఈ ప్రమాదం జరిగిన బొగ్గు గని లియావొనింగ్ ఫుక్సిన్ కోల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అని వెల్లడించారు. ఈ కంపెనీలో దాదాపు 5000 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గత ఏడాది ఫుక్సిన్ గనిలో గ్యాస్ లీకై దాదాపు ఎనిమిది మంది కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top