ఆత్మాహుతి దాడిలో 18మంది మృతి


కాబూల్‌: ఆఫ్గనిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. కారు బాంబ్‌ ఆత్మాహుతి దాడిలో సుమారు 18 మంది దుర్మరణం చెందారు. మరణించినవారిలో 10మంది భద్రతా సిబ్బందితో పాటు ఎనిమిది మంది సామాన్య పౌరులు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారు.



ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోని అత్యంత రద్దీ ప్రాంతంలో శనివారం ఈ కారు బాంబు దాడి జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీస్‌ చీఫ్‌ జనరల్‌ ఫైజులుల్లా తెలిపారు. అయితే ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని చెప్పారు. రందాన్‌ ప్రారంభం అయిన తొలిరోజే ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top