ఈ-పాస్బుక్ విధానంతో రైతులకు తీవ్రనష్టం


హైదరాబాద్ : పట్టాదారు పాసు పుస్తకాల రద్దు నిర్ణయం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్

నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ-పాస్బుక్లంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని, ఈ విధానంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు.


పాస్ పుస్తకాల స్థానంలో ప్రవేశపెడుతున్న ఈ-పాస్బుక్ విధానంతో ఎలాంటి ఫలితం ఉండదన్నారు.  రైతులకు తెలియకుండా వారి భూములు మరొకరికి బదలాయించే అవకాశం ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు.  అవగాహన లేకుండా జీవోలు జారీ చేయటం సరైన పద్ధతి కాదన్నారు.  కనుక తక్షణమే ఈ పాస్బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top