మ.12గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్మీట్ జరగనుంది. కాగా ‘ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లభించే అవకాశమే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ శుక్రవారం రాజ్యసభలో సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైఎస్ జగన్ ఇవాళ మాట్లాడనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్కు పిలుపునిచ్చింది.