పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ

పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ - Sakshi


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఈ సందర్భంగా వారితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ఢిల్లీలో దీక్ష చేస్తామని వైఎస్ జగన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీక్ష ఎప్పుడు చేపట్టాలి అన్నదానిపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఏపీలో కరువు, రైతుల ఆత్మహత్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై పార్టీ నేతలతో చర్చంచినట్లు తెలుస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top