బాధితుల్ని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటన బాధిత కుటుంబాలను ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పరామర్శించనున్నారు. దుర్ఘటన జరిగిన స్ధలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి..: రైలు ప్రమాదం గురించి తెలియగానే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.