ఏజీ కృష్ణమూర్తి మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : ముద్ర యాడ్స్ వ్యవస్థాపక చైర్మన్ ఏజీ కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఏజీ కృష్ణమూర్తి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు. కాగా న్యూమోనియాతో ఏజీ కృష్ణమూర్తి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే.