మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు

మనోజ్ దంపతులకు వైఎస్ జగన్ ఆశీస్సులు - Sakshi


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మంచు మనోజ్-ప్రణతి వివాహానికి హాజరయ్యారు. బుధవారం మాదాపూర్ హైటెక్స్ లో ఈ వివాహం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి తన తల్లి వైఎస్ విజయమ్మ, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తదితరులతో కలిసి స్వయంగా హాజరైన వైఎస్ జగన్, సుముహూర్తం అనంతరం కొత్త దంపతులను ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మ తదితరులు కూడా కొత్త దంపతులు మనోజ్- ప్రణతిలకు తమ ఆశీస్సులు అందజేశారు.


ఈ సందర్భంగా మోహన్ బాబు, విష్ణు దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.







 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top