బస్సు ఢీకొని యువకుడి మృతి


శంషాబాద్‌ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి-గొల్లపల్లి రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయాడు.



గొల్లపల్లి గ్రామానికి చెందిన డి.ఆనంద్(22) తన బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి ఎగిరి కిందపడిన ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top