హైదరాబాద్ లో భారీ భద్రత


హైదరాబాద్ : ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ జైలులో ఉరి నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను పటిష్టం చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్లో భారీగా భద్రత పెంచారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. యాకూబ్ మెమన్ ను ఈ రోజు ఉదయం నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉరితీసిన విషయం తెలిసిందే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top