మహిళా ట్రైనీ ఎస్సై ఆత్మహత్య
హైదరాబాద్ : నగరంలోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో విషాదం చోటుచేసుకుంది. హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఐఎస్ఏ)లో శిక్షణ పొందుతున్న ఓ మహిళా ఎస్సై బలవన్మరణం చెందారు. నిసాలో శిక్షణపొందుతున్న తన స్నేహితురాలిని కలిసేందుకు మహారాష్ట్ర పుణేకు చెందిన స్వాతి చౌహాన్ ఈనెల 24వ తేదీన వచ్చారు.
ఆమె మంగళవారం ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు జవహర్ నగర్ పోలీసులు తెలిపారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.