నీళ్ల మళ్లింపునకు నిరసనగా మూడురోజుల దీక్ష

నీళ్ల మళ్లింపునకు నిరసనగా మూడురోజుల దీక్ష - Sakshi


కర్నూలులో మే 16, 17, 18 తేదీలలో నిరాహార దీక్ష

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే నిరశన

కృష్ణానీళ్లను అక్కడే మళ్లిస్తే శ్రీశైలానికి నీళ్లు వచ్చేదెలా

ఆ తర్వాత నాగార్జున సాగర్ నిండేదెలా

కింద ఉన్నవాళ్ల గొంతులు, పొలాలు ఎండిపోతున్నాయి

ఇంత జరిగినా చంద్రబాబు నోట్లోంచి ఒక్క మాట రాదు

అందరికీ కనువిప్పు కలగాలనే దీక్ష చేపడుతున్నా

వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెల్లడి




హైదరాబాద్

అడ్డగోలు నీళ్ల మళ్లింపునకు నిరసనగా మే 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు కర్నూలులో తాను స్వయంగా నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కృష్ణాడెల్టాకు నీళ్లు వచ్చే వీలు లేకుండా మహబూబ్‌నగర్ నుంచే ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లను తోడేసుకుంటే.. దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలతో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు కూడా నీళ్లు రావని ఆయన చెప్పారు.



ఆయన ఇంకా ఏమన్నారంటే...


  • కరువు తాండవిస్తున్నా, చంద్రబాబు ఏం చేస్తున్నాడు.. కనీసం ఇక్కడ కేసీఆర్‌నైనా నిలదీసే పరిస్థితి లేదు

  • పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ అంటారు, డిండి ప్రాజెక్టు అంటారు

  • మన కళ్లెదుటే 115 టీఎంసీల నీళ్లు కేసీఆర్ తీసుకుపోతామంటున్నారు

  • చంద్రబాబుకు కనీసం అడగాలని ఎందుకు తట్టడం లేదు?

  • శ్రీశైలంలోకి నీళ్లు రావాలంటే మహబూబ్‌నగర్ నుంచి రావాలని అందరికీ తెలుసు

  • పైనుంచి వచ్చే నీళ్లు మహబూబ్‌నగర్ మీదుగా శ్రీశైలం వరకు రావాలి. ఆ తర్వాత కింద నాగార్జున సాగర్‌కు పోవాలి

  • మహబూబ్‌నగర్‌లోనే లిఫ్ట్‌ పెట్టి నీళ్లు తోడుకుంటాం, రంగారెడ్డికి.. డిండి ప్రాజెక్టుకు నీళ్లు పంపుతామంటే కనీసం ఒక్క మాట కూడా చంద్రబాబు నోట్లోంచి రావట్లేదు

  • శ్రీశైలం, నాగార్జున సాగర్ ఏమవుతాయి.. కింద ఉన్న జిల్లాల పరిస్థితి ఏంటని అడిగే పరిస్థితి లేదు

  • దీనివల్ల నిజానికి తెలంగాణలో ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కూడా నష్టపోతాయి.

  • శ్రీశైలం నుంచి సాగర్‌లోకి నీళ్లు వెళ్లకపోతే కృష్ణాడెల్టా పరిస్థితి దారుణం అయిపోతుంది

  • గోదావరి నీళ్ల పరిస్థితి కూడా అంతే

  • నీళ్లు వచ్చే మార్గంలోనే అడ్డుకుంటే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు అంటాడు.. నీళ్లు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే ఎలా అని నిలదీయడు

  • పట్టిసీమలో నిల్వ సామర్థ్యం లేదు.. వరద వచ్చినప్పుడు కిందకు రావాల్సిందే.

  • జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లలో వచ్చే నీళ్లను నిల్వచేసుకోగలిగితే, తర్వాత కిందకు పంపగలం, అప్పుడే రైతులు బాగుపడతారు

  • పోలవరం 190 టీఎంసీల లైవ్ స్టోరేజితో ఉండే ప్రాజెక్టు.. దాని పనులు 2, 4 శాతమే పూర్తయినట్టు కేంద్రమే చెబుతున్నా కాంట్రాక్టర్లను మార్చరు

  • ఓవైపు పెట్రోలు, డీజిల్, స్టీల్, అల్యూమినియం రేట్లు అన్నీ తగ్గాయి. ఇసుక ఉచితంగా వస్తోంది. అయినా పోలవరం హెడ్‌వర్క్ రేట్లు మాత్రం 4వేల కోట్ల నుంచి 7వేల కోట్లకు పెంచారు

  • కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకపోగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తున్నారు, సబ్ కాంట్రాక్టులు ఇచ్చుకోవచ్చని కేబినెట్‌లో తీర్మానం చేస్తున్నారు

  • అందుకే ఈ ప్రాజెక్టుకు నిధులివ్వడానికి కేంద్రం కూడా భయపడుతోంది

  • పోలవరం పూర్తి చేయడు.. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదు

  • పైగా పట్టిసీమ వల్ల గోదావరి జల వివాదాల నివారణ సెక్షన్లను ఉల్లంఘిస్తున్నారు

  • కేసీఆర్ ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణా నీళ్లను తీసుకుపోతుంటే చంద్రబాబు ఎందుకు అడగలేకపోతున్నారు?

  • శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే కిందకు పంపగలం. కానీ ఇప్పుడు 780 అడుగుల నీళ్లు మాత్రమే ఉన్నాయి

  • ఆ నీళ్లు నిండేదెపుడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఇచ్చేదెపుడు?

  • నాగార్జునసాగర్‌కు ఎలా వెళ్తాయి, తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎలా నీళ్లిస్తారు?

  • అందుకే చంద్రబాబు వైఖరికి నిరసనగా.. మే 16, 17, 18వ తేదీలలో కర్నూలులో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నాం. నేనే స్వయంగా దీక్షకు కూర్చుంటున్నాను

  • రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి పోవాలని ఈ దీక్ష చేస్తున్నా

  • చంద్రబాబు, కేసీఆర్, కేంద్రం మనసులు మారాలని నిరాహార దీక్ష చేపడుతున్నా

  • డిండి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే, అడ్డగోలుగా నీళ్లను డైవర్ట్ చేయడానికి వ్యతిరేకంగానే ఈ దీక్ష చేపడుతున్నా

  • కింద ఉన్న ఆయకట్టును కాపాడాలి, తాగడానికి నీళ్లివ్వాలి. ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి మనుషులుగా స్పందించాలనే ధ్యేయంతోనే దీక్ష చేస్తున్నాను

  • కృష్ణా డెల్టా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలే కాదు.. ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కూడా ఉన్నాయి

  • పైనుంచి నీళ్లు కిందకి రాకపోతే మేమంతా ఎలా బతుకుతాం? ఇలాంటి అంశం మీద కూడా రాజకీయాలు చేయడం సరికాదు

  •  

  • ఇక నిన్న పార్లమెంటులో జరిగిన విషయం చూద్దాం..

  • ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుందా లేదా అన్న అంశంపై మనకున్న ప్రశ్న గుర్తును, అనుమానాలను పెద్దవి చేసేలా పార్లమెంటులో మంత్రులు ప్రకటనలు చేశారు

  • కేంద్రమంత్రి నిన్న మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

  • ఆయన అంతలా మాట్లాడగలుగుతున్నారంటే దానికి కారణమేంటి, అది ధర్మమేనా?

  • ప్రత్యేక హోదా గురించి అడిగే నాథుడే లేదు

  • రాష్ట్రం విడగొట్టేటపుడు ఏమైందో అందరూ చూశాం

  • ఎన్నికల సమయంలో వాళ్లు మేనిఫెస్టోలు కూడా చూశాం

  • చంద్రబాబు, బీజేపీ అందరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టారు

  • మీకు అన్యాయం జరుగుతోంది, పరిహారం అందేలా ప్రత్యేక హోదా ఇస్తాం అన్నారు

  • ప్రచారంలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలోనూ పెట్టారు

  • ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, మరో ఐదేళ్లు కూడా ఇస్తామన్నారు

  • ఇప్పుడు హోదా రాని కారణంగా పరిశ్రమలు వచ్చే పరిస్థితి తగ్గింది

  • హోదా వస్తే.. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఆదాయపన్ను, ఎక్సైజ్ డ్యూటీ కట్టక్కర్లేదు, కరెంటు సగం రేటుకే వస్తుంది.

  • పరిశ్రమలు పెట్టినవాళ్లు వాళ్లు రవాణా మీద పెట్టే ఖర్చులో కూడా సగం తిరిగిస్తారు

  • ఇలాంటి రాయితీలు ఉంటే చంద్రబాబు పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడికో తిరగక్కర్లేదు. పారిశ్రామికవేత్తలే క్యూలు కడతారు. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వస్తాయి

  • ఇవన్నీ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే వస్తాయని తెలిసినా, చంద్రబాబు, కేంద్రంలో ఉన్న పార్టీలు మన జీవితాలతో చెలగాటం ఆడాయి

  • ఇప్పుడు మాత్రం ప్రత్యేకహోదా సంజీవని కాదని చంద్రబాబు అంటారు

  • కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటారు

  • ఆయన ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగారుస్తున్నారు

  • అవసరం లేదని ఆయన అనబట్టే కేంద్రంలో ఉన్న మంత్రులు ఏకంగా పార్లమెంటులోనే హోదా ఇవ్వక్కర్లేదని ధైర్యంగా చెబుతున్నారు

  • పోరాడాల్సిన వ్యక్తి పోరాడకుండా వదిలేయడం భావ్యమేనా?

  • ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో, రైల్వేజోన్, పోలవరం, ఇతర హామీలు నెరవేరకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారు

  • ఆయన పూర్తిగా రాష్ట్రాన్ని అమ్మేశాడు.. తన మీద ఉన్న 'ఓటుకు కోట్లు' కేసు నుంచి తప్పించుకోడానికి ఎవరినీ చంద్రబాబు నిలదీయలేకపోతున్నారు

  • ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు

  • ఆయన అలా చేయబట్టే కేంద్రమంత్రులకు పార్లమెంటులో కూడా అలా చెప్పే ధైర్యం వచ్చింది.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top