భర్తపై గొడ్డలితో దాడి: పరిస్థితి విషమం


హైదరాబాద్: అంబర్ పేట డివిజన్.. అహ్మద్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. భర్తపై భార్య విచక్షణా రహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో భర్త తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ప్రభు, సురేఖ దంపతులు అహ్మద్ నగర్లో నివాసముంటున్నారు. వారి మధ్య గొడవ కాస్త ముదిరి గొడ్డలి దాకా వెళ్లింది. భార్య సురేఖ భర్తపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రభును బస్తీవాసులు 108 వాహనంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top