చెట్టు నుంచి నీటి చుక్కలు..జనం మొక్కులు


కుత్బుల్లాపూర్: సుచిత్రా ప్రధాన రహదారిలోని విమానపూర్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలోని భారీ మేడిచెట్టు కొమ్మలన్నింటినీ యజమాని ఇటీవల నరికేశారు. అయితే, అక్కడక్కడా ఉన్న మోడుల నుంచి నీటి చుక్కలు పడుతుండడాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. అక్కడే చిన్నపాటి గుడి ఉండటంతో అదంతా దేవుడి మహిమేనని ఆనోటా.. ఈనోటా.. ఆ ప్రాంతంలో వ్యాపించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకోవటం మొదలైంది. జనం మొక్కులు, పూజలు ప్రారంభించటంతో అక్కడి రహదారిపై రాకపోకలు స్తంభించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top