ప్రమాదపు ప్రయాణం.. వైరల్ ఫోటో
హిమాయత్నగర్: విద్యార్థులకు బస్ కష్టాలు తప్పడం లేదు. సరిపడా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో నగర విద్యార్థులు నానాకష్టాలు పడుతున్నారు. ఉన్న అరకొర బస్సులూ సమయానికి రావడం లేదు. దీంతో వచ్చిన బస్సులోనే తొందరగా వెళ్లిపోవాలనే ఆత్రుతతో విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
రాంనగర్ నుంచి మెహిదీపట్నం వైపు శనివారం ‘ఏపీ11జెడ్–7593’ నంబర్ ఉన్న ‘6ఆర్’ బస్ వెళ్తుండగా... బాగ్లింగంపల్లి, నారాయణగూడ, హిమాయత్నగర్ బస్టాప్ల్లో కళాశాల విద్యార్థులు పెద్దఎత్తున ఎక్కారు. లోపల స్థలం లేకపోవడంతో బస్ డోర్ దగ్గర నిలబడడంతో పాటు బస్ వెనక కూడా వేలాడారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న దయాకర్ అనే వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది. విద్యార్థులు అలా ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నా.. బస్ కండక్టర్, డ్రైవర్ కనీసం స్పందించకపోవడం గమనార్హం.
మరిన్ని వార్తలు