గులాబీ దోపిడీపై విచారణ జరపాలి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సభకోసం కూలీ పేరిట జరుగుతున్న గులాబీ దోపిడీపై విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను బెదిరించి కూలీ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఒక్కరోజులో ఐస్ క్రీమ్ అమ్మితే ఏ వ్యాపారి అయినా రూ.7 లక్షలు ఎందుకు ఇస్తాడని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు కూలీ పేరిట ఇప్పటిదాకా ఎంత వసూలు చేశారు, ఏ వ్యాపారి ఎంత కూలీ ఇచ్చాడు, వాటికి సంబం ధించిన పన్నుల వ్యవహారం వంటివాటిపై సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.