ఉత్తమ్‌తో ఓయూ విద్యార్థుల భేటీ


సాక్షి, హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గురువారం భేటీ అయ్యారు. జూన్ 2న వర్సిటీలో జరిగే విద్యార్థి పోరుగర్జనకు హాజరు కావాలంటూ విద్యార్థి నేతలు ఆయనను ఆహ్వానించారు. కేసీఆర్ రెండేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఎండగట్టే విధంగా నిర్వహిస్తున్న ఈ సభకు హాజరుకావాలని ఉత్తమ్‌ను కోరారు.  విద్యార్థిసంఘాల నేతలు మానవతారాయ్, దయాకర్, కోట శ్రీనివాస్‌గౌడ్, శంకర్, నాగేశ్వర్‌రావు, రంజిత్ తదితరులు ఉత్తమ్‌ను కలసినవారిలో ఉన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top